హైదరాబాద్, నవంబర్ 30 : అమీర్ పేట్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి లిక్కర్ బాటిల్తో వచ్చి కలకలం సృష్టించాడు. ఎందుకు ఇలా చేశాడని ఆరా తీస్తే దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. మెట్రో స్టేషన్లో తాగునీరు ఉంటుందని అనుకొని మెట్రో సిబ్బందిని నీళ్లు అడిగానని, వారు బయటికి వెళ్లి తెచ్చుకోమని చెప్పారని చెప్పాడు. సరే అని బయటకు వెళ్లి వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తే తీరా పోలీసులు లోపలి అనుమతించలేదని తెలిపాడు. ఇక ఈ విషయంపై చిర్రెత్తుకొచ్చి లిక్కర్ బాటిల్ కొనుక్కుని మెట్రో స్టేషన్లోకి అడుగు పెట్టానని వివరించాడు. ఇదిలాగా ఉండగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న అధికారులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో..! కాగా మెట్రో ప్రారంభమై రెండు రోజులు కూడా గడవక ముందే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.