ఫలక్ నుమా ప్యాలస్ విందుపై అసంతృప్తి : నిజాం మనవడు ఆలీఖాన్

SMTV Desk 2017-11-29 18:28:48  Falak Numa Palace dinner party, nijam grand child fire on modi party, niti aayog officers.

హైదరాబాద్, నవంబర్ 29 : హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలస్ లో ఇవాంకాకు ప్రధాని మోదీ ఇచ్చిన విందు కార్యక్రమంపై ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విందు కార్యక్రమానికి నీతి ఆయోగ్ అధికారులు గత పది రోజులుగా తనను సంప్రదించి ఇవాంకా కోసం నిజాం గదిని బుక్ చేశారని చెప్పారు. అయితే తమ కుటుంబ సంస్కృతికి ఫలక్ నుమా ప్యాలస్ గుర్తింపు సూచకమని, అలాంటిది వారిని ఆ విందుకు ఆహ్వానించకపోవడంపై తీవ్ర నిరుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఇవాంకాకు చేసిన మర్యాదలన్ని నిజాం పాలకుల విధానంలోనే జరిగాయని అలీ ఖాన్ వెల్లడించారు.