హైదరాబాద్, నవంబర్ 29 : జీఈఎస్ సదస్సుకు విచ్చేసిన ప్రముఖులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు సలహాదారు ఇవాంక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు దేశ విదేశాలకు చెందిన దాదాపు 1500 మంది హజరయ్యారు. వీరందరికీ కేంద్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చేందుకు చారిత్రక ఫలక్నుమా ప్యాలెస్ లో విందు ఏర్పాటు చేశారు. అయితే, నిన్న రాత్రి ఈ విందుకు హాజరైన ప్రముఖులు, తదితురులతో, ఆ ప్యాలెస్ సందడి నెలకొనగా, అదే సమయంలో బాంబు బెదిరింపు వచ్చిందట. ఈ విషయాన్ని పోలీసులు నేడు మీడియాకు వెల్లడించారు. ప్యాలెస్లో బాంబు ఉన్నట్టు దుండగుడి నుంచి ఫోన్ రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. తర్వాత దాన్ని బెదిరింపు కాల్గా తేల్చారు. ప్రస్తుతం ఫోన్చేసిన ఆగంతకుడి కోసం పోలీసులు క్షుణ్ణంగా గాలిస్తున్నారు.