పాత దోస్తు ఇంటికి సీఎం కేసీఆర్‌...

SMTV Desk 2017-11-26 11:09:15  kcr, friend, rajendra prasad, courtesy

గాంధీనగర్‌, నవంబర్ 26: ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహానికి మంచి విలువ ఇస్తారన్న విషయం మనకు తెలిసిందే. ఆయన తన పాత మిత్రుడు కె.రాజేంద్రప్రసాద్‌(70)ను ఇంటికి వెళ్లి మరీ కలిసి కుశల ప్రశ్నలడిగారు. కేసీఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన రాజేంద్రప్రసాద్‌ మంచి మిత్రుడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలిసి శనివారం సీఎం గాంధీనగర్‌లోని రాజేంద్రప్రసాద్‌ ఇంటికెళ్లి పలకరించారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ..వీహెచ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేసీఆర్‌తో కలిసి యువజన కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశానని చెప్పారు. సీఎం తనను పరామర్శించడానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇంతటి స్థాయికి కేసీఆర్ ఎదిగినా తన స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఇంటికి రావడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం ఆనందంతో పరవశించి పోయింది.