మెట్పల్లి, నవంబర్ 25: తమ పట్ల ఎంపీ కవిత అవమానకరంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి బంద్కు చెరుకు రైతులు పిలుపునిచ్చారు. చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని, చెరుకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఎంపీకు వినతిపత్రం ఇవ్వడానికి యత్నిస్తే పట్టించుకోలేదని చెరుకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బ౦ద్ ను వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా పాటిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆవేదనను అర్ధం చేసుకోవాలని చెరుకు రైతులు వాపోతున్నారు.