నిజామాబాద్, నవంబర్ 23: ప్రతి అమ్మాయికి పెళ్లి అనేది కీలకమైన ఘట్టం. ఆ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ఇక్కడ ఓ పెళ్ళికూతురు అలానే ఆశపడుతూ పెళ్లి పీటలు ఎక్కింది. కానీ పెళ్ళికొడుకు మాత్రం ఆమె ఆశలను ఆవిరి చేశాడు. అసలు ఏం జరిగిందంటే... పెళ్లి అనగానే ముందుగా వచ్చే అంశం కట్నం. వరకట్నం తీసుకోవడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 1967 వరకట్న నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అయితే దీనికి విరుద్ధంగా సర్వం సిద్ధమైన పెళ్ళిలో వరుడు అదనపు కట్నం అడగడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. దీంతో కలత చెందిన వధువు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నదుకుడలో చోటు చేసుకుంది.