మేడ్చల్ డీఈవో ఉషారాణి సస్పెండ్...

SMTV Desk 2017-11-23 13:28:20  MEDCHAL DEO USHA RANI, Education Commissioner G. Kishan, MEDCHAL

మేడ్చల్, నవంబర్ 23: లంచం తీసుకోవడం క్షమించరాని నేరం.. అనే డైలాగు సినిమాల్లో వింటుంటాం. కానీ ఇప్పుడు ఆ డైలాగును నిజం చేసేశారు విద్యాశాఖ కమిషనర్ జి. కిషన్. వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లా డీఈవో ఉషారాణి, ఓ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వాహకుడి నుంచి లంచం డిమాండ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ జి. కిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.