హైదరాబాద్, నవంబర్ 23: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరుగుతుందని, పబ్ లకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నిశితంగా పరిశీలిస్తున్నామని, వచ్చే నెల 9వ తేది నుంచి క్షేత్ర స్థాయికి వెళ్తానని అన్నారు. అప్పటివరకు రాజకీయాలు మాట్లాడానని ప్రకటించారు.