ప్రకృతి వైపరీత్యంగానే ప్రమాదం...

SMTV Desk 2017-11-22 12:34:21  Kaleshwaram Project, karimnagar, hyderabad,

హైదరాబాద్, నవంబర్ 22: కాళేశ్వరం ప్రాజెక్ట్ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో మానవ తప్పిదం లేదని నిపుణుల కమిటీలో తేలింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ లో సొరంగ పనులు చేస్తుండగా సెప్టెంబర్ 20న ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. తాజాగా ఈ ప్రమాదంపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డీజీ ఎం. రాజు నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. సొరంగ పనుల్లో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలనూ చేపట్టారని, అయినా ఈ ప్రమాదం ప్రకృతి వైపరీత్యం గానే పరిగణి౦చాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.