హైదరాబాద్, నవంబర్ 21 : ఈ నెల 16న సనత్నగర్ బస్టాండ్ లో తెరాస నేత వల్లభనేని శ్రీనివాస్ హత్య విషయం కొలిక్కి వచ్చింది. 16వ తేదిన రాత్రి సమయంలో కొందరు దుండగులు బండరాళ్లతో కొట్టి హత్య చేసి పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా ఆరుగురు నిందితులను నేడు అరెస్టు చేశారు. పాత కక్షలతో పాటు మద్యం మత్తులోనే శ్రీనివాస్ను కొట్టి చంపారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఈ హత్యలో మొత్తం ఏడుగురు నిందితులు పాలుపంచుకోగా, పోలీసులకు ఆరుగురు చేజిక్కారు. మరో నిందితుడు షాజిద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.