హైదరాబాద్, నవంబర్ 21: బాలల దినోత్సవం నాడు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల శివరచిక్ (2) మరణించాడు. ఇప్పుడు ఈ కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి బచ్ పన్ స్కూల్ లో రెండేళ్ళ శివరచిక్ సంపులో పడి మరణించిన విషయం తెలిసిందే. నిన్నటివరకు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల శివరచిక్ మృతి చెందినట్లుగా అందరు అనుకున్నారు. కానీ ఈ కేసులో మరింతా పురోగతి సాధించేందుకు ఎంఈవో శ్రీనివాస్ ప్రయత్నించారు. పాఠశాలకు వేసిన సిలును తొలగించి అక్కడ ఉన్న సీసీ ఫుటేజికి సంబంధించిన డీవీఆర్ (డిజిటల్ వీడియో రికార్డర్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఫుటేజిని పరిశీలించగా.. ఈ నెల 14న ఘటన జరగగా.. అందులో ఒకటో తేది నుండి 15వ తేది వరకు ఎటువంటి దృశ్యాలు నమోదు కాలేదని గుర్తించారు. దీంతో పోలీసులకు తల్లిదండ్రులకు అనుమానలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు దృశ్యాలను ఎవరైనా డిలిట్ చేశారా ? లేదా నిజంగానే సీసీ కెమెరా పని చేయలేదా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.