ట్యాంక్‌బండ్‌ నుంచి పీపుల్స్‌ ప్లాజాకు చేరిన ‘లవ్‌ హైదరాబాద్‌’

SMTV Desk 2017-11-19 14:11:10  Love Hyderabad joins the Peoples Plaza from Tankband

హైదరాబాద్, నవంబర్ 19 ‌: తెలంగాణ రాజధాని ఎప్పటికప్పుడు పర్యాటకులను కనువిందుగా ఆకట్టుకుంటున్న తరుణంలో గతేడాది నవంబర్‌ 25న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ‘లవ్‌ హైదరాబాద్‌’ చిహ్నాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై దీన్ని ఏర్పాటుచేసింది. దీంతో హుస్సేన్‌సాగర్ తీరంలో ఈ చిహ్నం మరింత ఆకర్షణగా మారిపోవడంతో, ఆ ప్రదేశం నయా సెల్ఫీ స్పాట్‌గా మారింది. పర్యాటకులతో పాటు నగర ప్రజలూ దాని వద్ద ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో అధికారులు దృష్టికి వెళ్లడంతో, ఈ చిహ్నాన్ని అక్కడి నుంచి పీపుల్స్‌ప్లాజాకు తరలించాలని నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ ఆ చిహ్నాన్ని ఇప్పటికే తొలగించింది. ప్రస్తుతం దాన్ని వర్క్‌షాప్‌కు తరలించి మెరుగులు అద్దుతున్నారు. అనంతరం పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.