భర్తను, చున్నితో ఉరేసి చంపిన భార్యలు...

SMTV Desk 2017-11-19 11:37:00  murder, Crime, rangareddy,

రంగారెడ్డి, నవంబర్ 19: భర్తే దైవంగా భావిస్తుంది భార్య. కానీ ఆ భర్తే ఆమె పాలిట కాలయముడయ్యడని తెలిసి చంపేసింది. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా, జగద్గిరిగుట్ట వద్ద ఇద్దరు భార్యలు కలిసి తమ భర్తను చున్నితో ఉరేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. చంపడానికి గల కారణాన్ని పోలీసులు ప్రశ్ని౦చగా.. భర్త వేధింపులు తాళలేక ఈ దారుణానికి పాల్పడ్డామని చెప్పారు.