హైదరాబాద్, నవంబర్ 19 : నవంబరు 23 నుంచి జరగాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. దోస్త్ డేటాలో గందరగోళం కారణంగా డిగ్రీ మొదటి, మూడో సంవత్సర సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓయూ యాజమాన్యం తెలిపింది. అలాగే, పరీక్షల షెడ్యూల్, ఫీజు చెల్లింపు తేదీలను మళ్లీ ప్రకటిస్తామని ఓయూ యాజమాన్యం వెల్లడించింది.