హైదరాబాద్, నవంబర్ 16: అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జానారెడ్డిని అక్కడి నుంచి దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. జానారెడ్డి లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సిన జానారెడ్డి, అనారోగ్యానికి లోనవ్వడం పార్టీ సభ్యులను ఆందోళన గురి చేసింది.