రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి..

SMTV Desk 2017-11-15 17:09:57  road accident, software employee, hyderabad

హైదరాబాద్, నవంబర్ 15 : భాగ్యనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శిరీష అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి బంజారా హిల్స్ లోని పెన్షన్ ఆఫీసు వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఆమె తలపై నుంచి బస్సు వెళ్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విధుల నిమిత్తం ఆఫీసుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బంజారా హిల్స్ రోడ్ నెం.12లో స్పిన్ స్కీ సాఫ్ట్ వేర్ కంపెనీలో శిరీష పనిచేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు ఆసుపత్రికి తరలించారు.