భాగ్యనగరంలో భూ ప్రకంపనలు..

SMTV Desk 2017-11-15 12:32:06  Earthquakes in the Hyderabad city, jublihills, kbr park, durgam chervu, peddamma temple.

హైదరాబాద్, నవంబర్ 15 : భాగ్యనగరంలో భూ ప్రకంపనలు నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, దుర్గం చెరువు, పెద్దమ్మ గుడి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే భూ ప్రకంపన తీవ్రతను రిక్టర్ స్కేలుపై చూడగా 0.5గా నమోదైనట్టు ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇది తీవ్రతరమైనది కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు. కాని కాస్తంత జాగ్రత్త వహించమని సూచనలు జారీ చేశారు. ఈ భూమి కంపించిన విషయాన్ని కేవలం ఇళ్లలో ఉన్న వారు మాత్రమే గుర్తించి బయటకు పరుగులు తీశారు. కాని ఎవరికీ పెద్దగా తెలియకపోవడం విశేషం.