బాలుడిని బలి తీసుకున్న బడి...

SMTV Desk 2017-11-15 09:59:45  crime, hyderabad, malkaj giri, bachpan school

హైదరాబాద్, నవంబర్ 15: బాలల దినోత్సవం రోజు ఆడుతూ పాడుతుండగా ఓ చిన్నారిని మింగేసింది స్కూల్ నిర్ల్యక్షం. ఈ ఘటన హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి బచ్ పన్ స్కూల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బచ్ పన్ రెసిడెన్షియల్ స్కూల్ చూడటానికి ఓ అపార్ట్ మెంట్ లా ఉంటుంది. అందులో నిన్న బాలల దినోత్సవం సందర్బంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని పక్కనే ప్లే గ్రౌండ్ అని చెప్పి ప్లాస్టిక్ అట వస్తువులు ఉన్నాయి. అంతేకాదు దానికింద వాటర్ సంప్ వుంది. అక్కడ ఆడుతున్న రెండేళ్ళ చిన్నారి శివ్ రచిత్ తెరిచి వున్నా వాటర్ సంప్ లో పడిపోయాడు. శ్వాస అందక అక్కడికక్కడే ఆ చిన్నారి మరణించాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అనుమతులు లేకుండా స్కూల్ లను నడపడం, చిన్నారులను బలి తీసుకోవడం స్కూల్ యాజమాన్యాలకు అలవాటుగా మారింద౦టు ఆ తల్లిదండ్రులు పిహెచ్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం స్కూల్ నిర్వాహకులు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.