కొమురం భీం ఆసిఫాబాద్, నవంబర్ 14 : బాలల దినోత్సవ సందర్భంగా ఈ రోజు ఆసిఫాబాద్ లోని హోలీ ట్రినీటి పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రు 128 వ జయంతి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ... విద్యార్ధులు తమ ప్రతిభ ను సమాజం కు మంచి చేసి విధంగా రూపుదిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అరిగేల నాగేశ్వర్ రావ్, కరస్పాండెంట్ గాదివేణి మల్లేష్ యాదవ్, డైరెక్టర్ పిడుగు తిరుపతి, ప్రిన్సిపాల్ నాగేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదిదరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పిల్లల ఆట పాటలు, నృత్యాలతో అందరిని అబ్బురపరిచారు.