హైదరాబాద్, నవంబర్ 14 : నేను కూడా లోకలే అని ప్రముఖ నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ.. తనను నాన్ లోకల్ అంటూ ఆందోల్ లో కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఆందోల్ లో తాను ఇరవై నాలుగేళ్ళ నుంచి ఉంటున్నానని, అలాంటప్పుడు తాను నాన్ లోకల్ ఎలా అవుతానని ప్రశ్నించారు. తన నియోజకవర్గం మొత్తం సింగూరు జలాలు అందిస్తున్నానని, ఈ జలాలతో 40 వేల ఎకరాలకు నీరు అందుతోందన్నారు.