నవీపేట, నవంబర్ 13 : ఇద్దరు దళిత యువకులను కులం పేరుతో అవమానించి, వారిపై దాడి చేసి దూషించిన బీజేపీ నాయకుడు భరత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభగాపట్నంలో కొండ్ర లక్ష్మణ్, రాజేశ్వర్ లపై భరత్ రెడ్డి దాడికి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా గత నెల భరత్ రెడ్డి నిర్వహిస్తున్న మొరం క్వారీకి అనుమతుల గురించి ప్రశ్నించడంతో వారిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మానికోళ్ళ గంగాధర్ ఫిర్యాదుతో భరత్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.