హైదరాబాద్, నవంబర్ 11 : బాలికలకు బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ పత్రాలను సృష్టించి మైనర్ బాలికలను మేజర్లుగా మారుస్తూ బలవంతపు పెళ్ళిళ్ళు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ కేసులో మొత్తం 48 మంది దళారులపై కేసు నమోదు కాగా 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మహిళా దళారులు, ఇద్దరు బహ్రెయన్ దేశస్థులు ఉన్నారు.