హైదరాబాద్, నవంబర్ 11 : యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన ప్రభుత్వ బాధ్యత అని ఐకాస చైర్మన్ కోదండరాం స్పష్టం చేశాడు. హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో ఈ నెల 30 వ తేదీన "కొలువులకై కొట్లాట" అనే సభను నిర్వహిస్తామని తెలిపారు. నా౦పల్లిలోని కార్యాలయంలో తెలంగాణ ఐకాస నేతల సమావేశం అనంతరం సర్కార్ తీరుపై కోదండరాం విమర్శలు గుప్పించారు. డిసెంబర్ 9, 10 న నల్గొండలో అమరుల స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బతుకుదెరువు భారమై, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొలువులకై కొట్లాట కేవలం ఉద్యోగాల కోసమే కాదన్న ఆయన.. సామాజిక మార్పు కోసం ప్రయత్నం అని వెల్లడించారు.