హైదరాబాద్, నవంబర్ 07 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. నేడు సభలో భూరికార్దుల ప్రక్షాళన పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇవ్వడం జరిగింది. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టే విధానాన్ని సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరించారు. సభలో 8 ఆర్డినెన్స్ల స్థానంలో ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టింది.