వైబ్రంట్‌ ఐటీ సెక్టార్‌ తెలంగాణ : కేటిఅర్

SMTV Desk 2017-11-05 13:20:20  ktr, image tower, telangana, hyderabad rayadurgam,

హైదరాబాద్, నవంబర్ 5 : వైబ్రంట్‌ ఐటీ సెక్టార్‌గా తెలంగాణ రూపు దిద్దుకుంటోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యానిమేషన్‌-గేమింగ్‌ రంగాల్లో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఇమేజ్‌ టవర్‌ కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యానిమేషన్‌ పరిశ్రమలకు పలు రాయితీలు ఇస్తున్నామని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. మూడేళ్లలో ఐకానిక్‌ నగరంగా హైదరాబాద్‌ మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాయదుర్గంలోని 10 ఎకరాల్లో ఈ ఇమేజ్‌ టవర్‌ను నిర్మించనున్నారు. రూ.946 కోట్లతో 100 అడుగుల ఎత్తైన ఈ టవర్‌ను ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు.