ముంచేసిన భారీ గుంత..

SMTV Desk 2017-11-05 12:11:53  road accident, Jagtial, telangana, malyala

మల్యాల, నవంబర్ 5 : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నుకపల్లిలో, వరద కాలువ వంతెనపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జు నుజ్జు కాగా.. ఇద్దరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గుజరాత్‌ పోరుబందర్‌కు చెందిన జెముదా బాయి, కారా బాయిలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం రోడ్డుపై ఉన్న భారీ గుంత అని పోలీసులు గుర్తించారు.