హైదరాబాద్, నవంబర్ 04 : రాజధానిలో 17వ అంతర్జాతీయ సదస్సు జరగడం సంతోషంగా ఉందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి హరిదీప్సింగ్ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ... ఈ నెల 28న నాగోలు-మియాపూర్ మధ్య మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెట్రో వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.