సభలో ఎస్సీ, ఎస్టీ కమీషన్లపై చర్చలు.. కాంగెస్ వాకౌట్

SMTV Desk 2017-11-03 15:07:16  SC, STCommission, Minister Jagadish Reddy, assembly, hyderabad

హైదరాబాద్‌, నవంబర్ 03 : తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ ఏర్పాటులో కేంద్ర సహకారం తీసుకోవాల్సి ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఎస్సీ, ఎస్టీ కమీషన్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ పెరిగిందన్నారు. కమీషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, ఏర్పాటులో కేంద్ర సహకారం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని కాంగ్రెస్‌ సభ్యులు, భాజపా నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేశారు.