న్యూయార్క్ ఉగ్రదాడిని ఖండించిన... ప్రధాని, రాష్ట్రపతి...

SMTV Desk 2017-11-01 13:54:37  modi condolence, ramnath kovind, new york terror attack,

న్యూ ఢిల్లీ, నవంబర్ 01; అమెరికాలోని న్యూయార్క్ నగరం కేంద్రంగా ఉగ్రమూకలు మరోమారు రెచ్చిపోయారు. ఈ మద్య ఓ సంగీత విభావరిలో దుండగుడు జరిపిన కాల్పుల సంఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. న్యూయార్క్ లోని డబ్ల్యూటీసీ వద్ద ఓ దుండగుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించడంతో 8 మంది మృతి చెందగా...మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో అమెరికాకు భారత్ అండగా ఉంటుందని, బాధితులు త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు. ఈ మారణకాండ ఐసిస్ పని అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.