హైదరాబాద్, అక్టోబర్ 28 : రాజధాని అభివృద్దిలో కార్పొరేటర్లు చురుగ్గా పాల్గొనాలని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరాన్ని తిర్చీ దిద్దడంపై ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు. కార్పోరేటర్లు ఎన్నికై ఏడాదిన్నర కావస్తుండడంతో ఇకపై ప్రజల మధ్య తిరుగుతూ..వారి కష్టసుఖాలు పంచుకొంటూ, చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ నుంచి ప్రజలు అద్భుతాలు ఆశించడం లేదని, ముందుగా నగరవాసుల కనీస అవసరాలు తీరిస్తే సరిపోతుందని ఆయన సూచించారు. మంచినీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, సంక్షేమ కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దితే ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు కాకుండా మంచి పేరు తీసుకురాలని కేటీఆర్ స్పష్టం చేశారు.