వరంగల్, అక్టోబర్ 22 : టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన నిమిత్తం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ చేరుకున్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సభాపతి మధుసూదనాచారి, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, కలెక్టర్ ఘన స్వాగతం పలికారు. అన౦తరం కాకతీయ టెక్స్ టైల్ పార్కుకు ముఖ్యమంతి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుకు కాజీపేట ఓవర్ బ్రిడ్జికి ఐటీ, ఇంక్యుబేషన్ సెంటర్ ఫేస్-2 కు శంకుస్థాపన చేశారు. ఈ టెక్స్ టైల్ పార్కులో రూ. 3500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే 35 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మెగా టెక్స్ టైల్ పార్కును వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీ చింతపల్లి దగ్గర నిర్మించనున్నారు.