ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయిన ఉపరాష్ట్రపతి

SMTV Desk 2017-10-21 18:23:59  Delhi Aims hospital, Vice-President Venkiah Naidu

న్యూఢిల్లీ, అక్టోబర్ 21 : సాధారణ వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కార్డియో, న్యూరో సెంటర్ లో వెంకయ్యకు యాంజియోగ్రఫీ పరీక్షలు నిర్వహించగా, గుండె నుంచి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమని ఒకటి పురుకు పోతున్నట్లు గుర్తించిన వైద్యులు స్టెంట్‌ మార్పిడి చేశారు. ప్రొఫెసర్‌ బలరాం భార్గవ ఆధ్వర్యంలో ఈ వైద్య పరీక్షలు చేశారు. కాగా వైద్యులు ఆయనను మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు వెంకయ్యను రాష్ట్రపతి, ప్రధాని ఫోన్ లో పరామర్శించారు.