పోలీసుల అమర స్థూపం వద్ద హోంమంత్రి నివాళ్ళు

SMTV Desk 2017-10-21 17:05:02  hyderabad, Home Minister Nayani Narsinhareddy, police

హైదరాబాద్, అక్టోబర్ 21 : తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ గోషా మహల్ స్టేడియంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి నాయినితో పాటు డీజీపీ అనురాగ్‌ శర్మ నర్సింహారెడ్డి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అమర స్థూపం వద్ద హోంమంత్రి నివాళ్ళు అర్పించారు. అధునాతన ఆయుధాలు సమకూర్చడంతో పాటు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. స్నేహపూర్వక పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తూ నేరాలను నిమంత్రిస్తున్నారని నాయిని కొనియాడారు. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మొక్కలను నటీ సంరక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రద్ధించిన హోంమంత్రి ముఖ్యమైన కార్యక్రమం వల్ల సీఎం హాజరుకాలేక పోయారని వివరించారు.