హైదరాబాద్, అక్టోబర్ 20 : రాజధానిలో తుపాకులు విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠా నుంచి దేశవాళీ తుపాకీ, విదేశీ తుపాకీ, బుల్లెట్లు, రెండు మొబైళ్లు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. ఒడిశాలోని అనుగుల్ లో రెండు తుపాకులు తక్కువ ధరకు కొని హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రకాశం జిల్లా సునీల్కుమార్తో కలిసి ప్రణాళిక వేశాడు. ఈ క్రమంలో సరూర్ నగర్లో తుపాకులు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.