హోటల్ లో పేకాట ఆడుతూ దొరికిన ప్రముఖులు...

SMTV Desk 2017-10-20 18:09:13  HYDERABAD, TASKFORS POLICE,

హైదరాబాద్, అక్టోబర్ 20: ప్రముఖుల పేకాట రాయుళ్ళు ఎట్టకేలకు పట్టుబట్టారు. హైదరాబాద్ లోని మారియట్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించగా 37 మంది పేకాట ఆడుతూ దొరికారు. నిందితుల నుంచి రూ.23లక్షల నగదు, సెల్‌ఫోన్లు, స్వైపింగ్‌ మిషన్లు, 15 ఖరీదైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉన్నట్లు సమాచారం. పేకాట ను ప్రోత్సహించిన హోటల్ సిబ్బంది ను కూడా అరెస్టు చేశారు.