హైదరాబాద్, అక్టోబర్ 19: తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా) గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ "దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు దీపాల పండుగ చెడు మీద విజయాన్ని సూచిస్తుంది. క్లిష్టమైన సందర్భాల్లో దుష్టులను జయించటానికి ప్రేరేపిస్తుంది. శాంతి, అమితత్వం, మత సామరస్యం ఉన్న ఒక సమాజాన్ని నిర్మిస్తాయి. " అని ఆయన ఒక సందేశంలో చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దీపావళి సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో నూతన వెలుగులో తెచ్చిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.