హైదరాబాద్, అక్టోబర్ 14 : హైదరాబాద్ పాతబస్తీలో వివిధ కల్తీ ఆహార పదార్ధాల తయారీ కేంద్రాలపై శుక్రవారం దక్షిణ మండలం పోలీసులు దాడులు చేశారు. వంట నూనె, మిర్చీ, పసుపు, తేనె, కల్తీలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. రూ. 50 లక్షల విలువైన కల్తీ పదార్ధాలతో పాటు యంత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ నగర్ లో కల్తీ వేరుసెనగ నూనెపై దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేయగా పురానాపుల్ లో నటరాజ్ ఆయిల్ ఫ్యాక్టరీ పై తనిఖీలు చేశారు. 200 నకిలీ వంట నూనె పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ యజమాని శ్యామ్సుందర్ లోయ మరో ఇద్దరినీ పట్టుకున్నారు. గత 17 ఏళ్లుగా వంట నూనె కల్తీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మరిన్ని కంపెనీల్లో దాడులు నిర్వహించి కల్తీ సామగ్రిని పట్టుకున్నారు.