రోహింగ్యాల పై దాడి.....

SMTV Desk 2017-10-11 16:29:59  Rohingya couple, Attack , Rohingya , police

హైదరాబాద్, అక్టోబర్ 11: హైదరాబాద్ లోని బాలాపూర్ లో నివసిస్తున్న రోహింగ్యా దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. బాలాపూర్ ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం...మయన్మార్ కు చెందిన రోహింగ్యా ముస్లిం దంపతులు మౌలానా జాహెద్ హుస్సేన్(32), ఖతీజాబేగం(28)లు బాలాపూర్ రాయల్ కాలనీ అలీజాకాలనీ లో నివాసముంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేశారు. స్థానికులు ఆ దంపతులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నఈ దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వారి నుంచి వివరాలు స్వీకరించగా, దాడి చేసిన వారి భాష రోహింగ్యాలదే అని చెప్పడంతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.