హైదరాబాద్, సెప్టెంబర్ 26 : టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వానికి సింగరేణి కార్మికులపై నమ్మకం ఉందని... తమకు ఓట్లు వేసి విజయాన్ని కట్టబెడతారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు మద్యం, డబ్బు, విందులతో వారిని ఎందుకు ప్రలోభపెడుతున్నారు" అని చేసారు. తెలంగాణ ప్రభుత్వ౦ వారసత్వ ఉద్యోగాల విషయంలో నాటకాలు ఆడుతోందని, ఈ విషయం కార్మికులందరు గమని౦చాలని అన్నారు. తెలంగాణలోనే తిరుగులేని పార్టీ అని చెప్పుకుంటున్న నేతలు ఇలాంటి ప్రలోభాలకు దిగడం ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ కార్మికుల తీర్పే టీఆర్ఎస్ కు చెంపపెట్టు కావాలన్నారు.