కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద భారీ ప్రమాదం..!

SMTV Desk 2017-09-20 17:15:53  kaleshwaram, kaleshwaram project, sircilla, ellanthakunta

కాళేశ్వరం, సెప్టెంబర్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట (మండలం) తిప్పాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న సొరంగం పైకప్పు కూలి ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందిన...వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందం క్షతగాత్రులను ఆసుపత్రికి తలించారు. ఈ ప్రమాదంలో శిథిలాల క్రింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సొరంగ మార్గంలో పోలీసు సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు జార్ఖండ్, బీహార్ వాసులుగా గుర్తించారు. విషయం తెలిసిన ఎస్పీ విశ్వజిత్ ఘటన స్థలాన్ని సమీక్షి౦చారు. నిర్మాణంలో ఉన్న సొరంగ౦ పైకప్పు కూలడానికి ఇంజనీర్ నిర్లక్ష్యం కారణమా వాతావరణ మార్పులా..అనే దిశగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.