హో౦గార్డుల నిరసనకు కిషన్ రెడ్డి మద్దతు...

SMTV Desk 2017-09-16 13:42:05  hyderabad, basheerbagh, press club at basheerbagh, G. kishan reddy MLA

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఎదుట హో౦గార్డుల కుటుంబీకులతో కలిసి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి రోడ్డుపై బైఠయిoచారు. గత మూడు సంవత్సరాల నుండి హో౦గార్డులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ప్రసూతి మహిళలకు సెలవులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చెకుర్చుతామని ప్రకటించింది. ఇప్పటివరకు హో౦గార్డు సమస్యలపై ఎటువంటి పరిష్కారం చూపలేదని, బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా కు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులతో ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని, హోoగార్డు కుటుంబాలను సైఫాబాద్ పోలిస్ స్టేషన్ కు తరిలించారు.