మియాపూర్ లో మాదక ద్రవ్యాల గుట్టురట్టు...

SMTV Desk 2017-09-14 19:15:47  hyderabad, miyapur, toxic substances

హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్ మియాపూర్ మక్తలో పోలీసులు భారీగా మత్తు పదార్ధాలను గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్ కు చెందిన మంగిలాల్ చౌదరి, కిషన్ లాల్ చౌదరిలు రాజస్థాన్ నుండి మత్తు పదార్ధాలు, ఒపియం తీసుకొచ్చి ఇంట్లో నిల్వ చేసేవారు. అనంతరం మత్తు పదార్ధాలను శుద్ధి చేసి హెరాయిన్ గా మార్చేవారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుల నుండి 1.4 కిలోల ఒపియం, 45 గ్రాముల హెరాయిన్, 26 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విక్రయించేందుకే రాజస్థాన్ నుండి నగరానికి తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.