హైదరాబాద్, సెప్టెంబర్ 9: సినిమా చూసిన తర్వాతే డబ్బులు చెల్లించండి. ఇదేదో సరదాగ ఆట పట్టించడానికి చెబుతున్నారా అని అనుకుంటున్నారా, కదండీ నిజమే ఈ మాట ఈపే లెటర్ అనే స్టార్ట్ అప్ సంస్థ అంటోది. ఇదే కాకుండా చాలా రకాల సేవలకు అంటే రైలు ప్రయాణం, షాపింగ్ , టూరిజం, కిరాణా కూడా ఇదే ఆఫర్ ప్రకటిస్తున్నది.ఈ స్టార్ట్ అప్ సంస్థ, దీని కోసం ఐ ఆర్ సి టి సి, ఇండియా మార్ట్, ఆక్సిజన్ వంటి 5000 సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈపే లెటర్ సంస్థ అందిస్తున్న ఈ సేవలను పొందాలంటే ఈ మెయిల్ ఐడి,మొబైల్ నెంబర్, ఆధార్,పాన్ కార్డు, వివరాలు అందిచాలి. బి2బి కంపెనీల్లో రూ 25000 వరకు, బి2సి కంపెనీల్లో రూ 2500 వరకు, షాపింగ్ సేవలు పొందవచ్చని ఈపే లెటర్ సంస్థ తెలిపింది. ఆన్ లైన్ సేవలు పొందాక 14 రోజులలో డబ్బులు చెల్లించాలి. లేదంటే 3 శాతం పెనాల్టి ఉంటుందని సంస్థ ప్రకటించింది.