జీఎస్టీ సమావేశం ప్రారంభం అరుణ్‌జైట్లీ హాజరు..

SMTV Desk 2017-09-09 13:05:14  HYDERABAD, 21ST MEETING OF GST , ,ARUN JAITLEY,

హైదరాబాద్, సెప్టెంబర్ 9: జీఎస్టీ ప్రారంభమైన రెండు నెలల్లోనే సుమారు 75 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. ఈ రోజు హైదరాబాద్ లో 21వ జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షత వహించనున్నారు. దీనికి గాను శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, సహాయ మంత్రి శుక్లాకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఘన స్వాగతం పలికారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కీలకాంశాల ఎజెండాగా సాయంత్రం 5 గంటల వరకూ హెచ్‌ఐసీసీలో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.