నిమజ్జనానికి సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణనాథుడు

SMTV Desk 2017-09-04 15:26:43  hyderabad, khairatabad, ganeshudu,

హైదరాబాద్, సెప్టెంబర్ 4: గణపతి బప్పా మోరియా...జై గణేశా...అంటూ గణనాదులను ఘనంగా నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతిని ముందస్తుగానే నిమజ్జనం చేయనున్నట్లు తెలంగాణ‌ డీజీపీ అనురాగ్‌శర్మ చెప్పారు. నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తూ, రేపు హైదరాబాద్‌లో 26 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 18 పారామిలిటరి బలగాలు కూడా హైద‌రాబాద్ కి చేరుకోవడంతో న‌గ‌రంలోని ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లను మూసివేయనున్నట్లు, అధికారులు తెలిపారు. నగర వాసులకి ప్రయాణాలల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను, ప్రతి అర్ధగంటకు ఒక ఎంఎంటీఎస్‌ రైలు ఏర్పాటును చేస్తున్నామన్నారు.