ఖైరతాబాద్ గణనాథుని వద్ద కొనసాగుతున్న భక్తుల రద్దీ

SMTV Desk 2017-09-03 16:05:31  hyderabad, khairatabad, ganeshudu,

ఖైరతాబాద్, సెప్టెంబర్ 3: దండాలయ్య...ఉండ్రాలయ్య...దయ ఉంచయ్య దేవా..అంటూ ఖైరతాబాద్ లో కొలువు దీరిన 57 అడుగుల బొజ్జ గణపయ్యను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ప్రతి ఏడాది ఈ విఘ్నేశ్వరున్ని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి అనేక వేల మంది భక్తులు క్యూ లైన్లు కడుతారు. కుల, మత బేదం లేకుండా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో వేల సంఖ్యలో గణనాథున్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అలాగే నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు.