బంగారం ధర వరుసగా రెండో రోజు(జూలై 5) కూడా పెరిగింది. దీంతో హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.35,610కు ఎగసింది. అంతర్జాతీయ ట్రెండ్ ప్రతికూలముగా ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధర పెరిగిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగానే పెరిగింది. రూ.10 పెరుగుదలతో రూ.32,630కు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర దాదాపు స్థిరంగానే ఉంది. రూ.40,580 వద్ద నిలకడగానే కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర స్వల్పంగానే పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.10 పెరుగుదలతో రూ.34,510కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.33,310కు ఎగసింది. మరోవైపు కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇది రూ.40,580 వద్దనే స్థిరంగా ఉంది.