పెరిగిన పెట్రోల్ ధర...డీజిల్ ధర మాత్రం!

SMTV Desk 2019-11-25 11:55:22  

సోమవారం పెట్రోల్ ధర 13 పైసలు పైకి కదిలింది. డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.79.45కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.71.73 వద్దనే స్థిరంగా కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదలాడుతున్నాయి.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 12 పైసలు పెరుగుదలతో రూ.79.01కు చేరింది. డీజిల్‌ ధర మాత్రం రూ.71.04 వద్దనే స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 13 పైసలు పెరుగుదలతో రూ.78.65కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.70.70 వద్ద నిలకడగా కొనసాగుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 12 పైసలు పెరుగుదలతో రూ.74.66కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.65.73 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 12 పైసలు పెరుగుదలతో రూ.80.32కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.68.94 వద్దనే నిలకడగా కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.09 శాతం పెరుగుదలతో 57.82 డాలర్లకు తగ్గింది.ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు.