ముంబయి: దేశీయ వైమానిక రంగ దిగ్గజం ఇండిగో ఎయిర్లైన్స్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మిషెల్ స్విటెక్ తన పదవి నుంచి వైదొలగారు. గత ఏడాది ప్రారంభంలోనే మిషెల్ ఇండిగో సంస్థలో చేరారు. ఆయన విదేశీ మార్గాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తారు. దీనిపై ఇండిగో ప్రతినిధి స్పందిస్తూ వ్యక్తిగత కారణాలతో మిషెల్ పదవి నుంచి వైదొలగినట్లు పేర్కొన్నారు. 2018 డిసెంబర్ నుంచి ఇండిగో నుంచి వైదొలగిన రెండో కీలక వ్యక్తి మిషెల్. ఇండిగో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్న సిండీ గత డిసెంబర్లో వైదొలగారు. ఆమె గతంలో డెల్టార ఎయిర్లైన్స్ పనిచేశారు. ఆన్టైమ్ పర్ఫార్మెన్స్లో ఇండిగో పరిస్థితి దారుణంగా ఉంది. ఎయిర్ ఇండియా చివర్లో ఉండగా.. దాని కంటే ఒక స్థానం ముందుంది. . ఇక ఈ విభాగంలో గోఎయిర్ సంస్థ తొలి స్థానంలో కొనసాగుతోంది.