కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో డీలా పడిపోతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరోపేద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెరాసలో చేరబోతున్నారు. ఏప్రిల్ 3వ తేదీన నర్సాపూర్లో జరుగబోయే తెరాస ఎన్నికల ప్రచార సభలో ఆమె సిఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఇటువంటి బలమైన నేతలను, ఎమ్మెల్యేలను కోల్పోవడం వలన కాంగ్రెస్ పార్టీ ఎలాగూ నష్టపోతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఫిరాయింపులు కాంగ్రెస్ శ్రేణులను మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది కనుక లోక్సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.